తాడేపల్లి: జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, మధ్యాహ్న భోజనం, స్కూల్ కిట్స్, పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమం, ఇంగ్లీష్ మీడియం విద్యా ప్రణాళికపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. సీఎం క్యాంపు ఆఫీస్లో జరిగిన ఈ సమీక్షలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కొత్త పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్స్ను సీఎం వైఎస్ జగన్ పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన కిట్స్ అందాలని ఈసందర్భంగా ఆయన స్పష్టం చేశారు. పాఠశాలల్లో నాడు-నేడు పనులపై సీఎం అధికారులను ఆరా తీయగా.. అన్ని స్కూళ్లల్లో పనులు ప్రారంభమయ్యాయని అధికారులు తెలిపారు.
‘జగనన్న గోరుముద్ద’పై ముఖ్యమంత్రి సమీక్ష